Monday 12 December 2011

Na Jnapakalu 2

ఓం నమో భగవతే విద్యారణ్య స్వామియే నమః     నా జ్ఞాపకాలు 2 
ఒక సారి గుంటూరులో ప్రసిద్ధిచెందిన ఒక లేడి డాక్టర్ గారు స్వామి దర్శనానికి వొచ్చారు. స్వామికి నమస్కరించి కూర్చున్నది. తనను గురుంచి పరిచయం చేసుకున్నది. తను దియోసాఫికాల్ సొసైటీ కి పెద్ద లీడర్ నన్నది. స్వామివారు అలానా! అని అన్నారు.  తరువాత ఆయన సమాజం ఏ వైపూకు నడిస్తే మంచిది , ప్రపంచంలో ఏర్పడిన రక రకాల సమాజాలు వాటి సిద్ధాంతాలు, వైదిక మత ప్రాసస్యం, ఇలా ఎన్నో విషయాలు చాలాసేపు చెప్పారు. ఆమె వెళ్లేముందు "భగవత్ భారతి " గ్రంధాన్ని ప్రసాదంగా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్లి ఆ రోజే మొత్తం చదివినట్లుఉన్నది. మర్నాడే మళ్లీ వచ్చింది. స్వామి మీరిచ్చిన గ్రంధం చదివాను. మరీ అన్యాయంగా రాసారు. చాలా వరకు స్త్రీ దూషనే కనిపించింది. నాకు నచ్చలేదు స్వామి అన్నది. స్వామివారు ఎంతమాత్రమూ భాధ పడలేదు. అమ్మ! ఫై ఫై న  చదివేవారికి భగవద్భారతి మీకు లాగునే అర్ధం ఆవుతుంది.  ఇక్కడ స్త్రీ అన్న మాటకు అర్ధం వేరు. శారీరకంగా, మానసికంగా స్త్రీలు శ్రుష్టి లోనే బలహీనులు. మమకారాలు భాన్ధంవ్యాలు వీటిలోనే చాలావరకు స్త్రీలు ఆనందంగా ఉంటారు. పురుషుడైన సరే స్త్రీల మనస్సు కలిగిఉంటే వారూ స్త్రీ సమానులే. మోక్షమన్నది పురుషార్ధలలో పరమమన్నవి శాస్త్రాలు. మోక్షమంటే ఆత్మను పరమాత్మలో లీనం చేయటం. ఇందుకు ద్రుఢమైన సాధన కావాలి. మనస్సు ద్వందాతీతం కావలి. బలహీన మనస్సులకు పరమాత్మ అందదు.  మోక్షం కావలి అన్న కోరిక కలుగుటే చాల కష్టం. స్త్రీలైనా మొక్షీస్చ కలుగుతే తన్మార్గంలో నిశ్చలంగా ఉండగలిగితే ధన్యులే.  గార్గి, మైత్రేయి వంటి స్త్రీలు గొప్ప జ్ఞానులు. కాని వారిలాగా ఎంతమంది స్త్రీలున్నారు. ప్రకృతిలో స్త్రీలకున్న ఆకర్షణ చాల గొప్పది . ప్రక్రుతి మొహం  మనిషిని బలహీన పరుస్తుంది.  కనుక మోక్ష గ్రంధాలు  స్త్రీ ఆకర్షణ ముముక్షువులకు ఎంత ప్రమాదకరమో రక రకాలుగా తెలియపరస్తుంటై . భగవద్భారాతిని మీరు ఈ దృష్టితో చదవండి అని అన్నారు. ఆమె గూడా ఎంతో సంతోషపడింది .  స్వామి మీరు అనుకున్నంత తేలికగా అందరు.  మీది చాల గంభీర తత్వం .  నేను చేసిన కామెంట్ కు మీకు చాల కోపం వస్తుందనుకొన్నాను .  కాని మీకు కోపం రాలేదు. నాకు వివేకాన్నిచ్చారు. సమాజంలో నాకు ఎంత పేరున్న మీ ముందు నేను సున్నా. తొందరపడి మాట్లాడను, క్షమించండి అంది.
      ఒక సరి ఒక డాక్టర్అమ్మగారు స్వామిని దర్శించింది. శ్రీ స్వామిలో ఆమెకు ముగ్ధ మనోహర శ్రీకృష్ణ భగవానుడు  కనిపించాడట. ఆమె హృదయంలో కృష్ణ స్వరూపముగా ప్రతిస్తించు కున్నది.  ఒక రోజు వాళ్ళ ఇంటికి బిక్షకు రమ్మని ఆహ్వానించింది. వాళ్ళ ఇంటికి  స్వామిని తెమ్మని కారు పంపింది. ఈరోజు స్వామి వారు మనింటికి వస్తున్నారు , అందరు మర్యాదగా చక్కగా ఉండాలి  అని పిల్లలకు చెప్పింది. ఇల్లంతా శుభ్రంగా కడిగించింది. ముగ్గులు పెట్టారు. గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టేరు .  అంతా హడావిడి, స్వామివారి కారు ఇంటిముందు ఆగింది. డాక్టర్ అమ్మ భార్తగారు కూడా డాక్టరు.  ఇద్దరు పూర్నఖుమ్భంతో లోపలికి స్వాగతించారు. 

మిగతాది ౩ భాగంలో  

No comments:

Post a Comment